Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

PM Kisan 20th Instalment 2025

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్... పీఎం కిసాన్ డబ్బులు నేరుగా అకౌంట్ లో ఎప్పుడు పడతాయి..?

 

 

PM Kisan 20th Instalment 2025 కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు అతి త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అతి త్వరలోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటికే 19వ విడత డబ్బులు ఫిబ్రవరి నెలలో రైతుల అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు మరో రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ యోజన పేరిట వారి అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తోంది. ఇప్పటికే వరుసగా 19 సార్లు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు వేసింది. ఇప్పుడు మళ్లీ 20వసారి కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉంది. పీఎం కిసాన్ యోజన కింద వేసే డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లో పడతాయి. ఈ డబ్బు రుణం రూపంలో కాదు అని గుర్తుంచుకోవాలి. . ఈ డబ్బులను రైతులను తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. అలాగే ఎలాంటి లెక్క చూపించాల్సిన అవసరం లేదు. ఈ డబ్బులను రైతులు తమ ఇష్టానుసారం ఉపయోగించుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి మీరు ఎలాంటి జవాబు దారి ఇవ్వాల్సిన అవసరం లేదు. పీఎం కిసాన్ యోజన డబ్బులు కోసం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయలు వారి అకౌంట్లో పడుతున్నాయి. ఈ మొత్తం కూడా మూడు దఫాలుగా ప్రతిసారి 2000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ కసరత్తు చేసి రైతుల అకౌంట్లో 2000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24, 2025న బీహార్‌లోని భాగల్పూర్ పర్యటన సందర్భంగా పీఎం-కిసాన్ పథకం 19వ విడత డబ్బులు రైతుల అకౌంట్లో వేశారు.
PM-KISAN పథకం లబ్ధిదారులకు జూన్ నాటికి వారి 20వ విడత డబ్బులు రైతులు అకౌంట్లో నేరుగా పడే అవకాశం ఉంది. ఆశించవచ్చు ఎందుకంటే చివరి విడత ఫిబ్రవరిలో పంపిణీ చేశారు. వాయిదా తేదీ ఇంకా తెలియదు. కేంద్ర ప్రభుత్వం తేదీని తెలియజేస్తుంది. ఈ పథకం ప్రకారం, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి – ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలల్లో సంవత్సరానికి మూడు సార్లు – వాయిదాలు విడుదల చేస్తారు. ఈ నిధులు వెంటనే లబ్ధిదారుల బ్యాంకులకు జమ అవుతాయి.
PMKISAN నమోదిత రైతులకు eKYC తప్పనిసరి. OTP ఆధారిత eKYC PMKISAN పోర్టల్‌లో అందుబాటులో ఉంది. అలాగే బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించవచ్చు. ఆర్థికంగా ఉన్నత హోదా కలిగిన లబ్ధిదారుల కింది వర్గాలు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు కారు.

 

 

PM Kisan official website

 

 

 

 

 

Related Articles

Back to top button