Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

rythubandhu.telangana.gov.in Rythu Bandhu Status 2022

Raythu Bandhu Payment Status

 

 

 

రైతులకు రైతు బంధు పెట్టుబడి సాయాన్ని ఈసారి త్వరగానే అందించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. జూన్‌ మొదటి వారంలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇక తెలంగాణలోని 66.61 లక్షల మంది రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఇప్పటికే ఉంది. ఈ డేటాను అప్‌డేట్‌ చేయటం, కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పించటం తదితర పనులపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించారు.

 

 

జూన్‌ నెల ఒకటో తేదీ నుంచే వానాకాలం సీజన్‌ ప్రారంభం అవుతుంది. దీంతో సీజన్‌ మొదలుకాగానే మొదటి వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేయాలని సర్కార్ భావిస్తోంది. 2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినపుడు.. మే నెలలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత కొన్ని సీజన్లలో ఆలస్యంగా ఇచ్చారు. వానాకాలమైతే జూన్‌, జులైలో.. యాసంగి అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇస్తూ వస్తున్నారు.

 

 

ఈసారి మాత్రం జూన్‌ మొదటివారంలోనే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గడచిన యాసంగి సీజన్‌ నాటికే రాష్ట్రంలో 66.61 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలున్నాయి. 152.91 లక్షల ఎకరాలకు రైతులకు యాజమాన్య హక్కులు లభించాయి. అయితే యాసంగిలో 62.99 లక్షల మంది రైతులకు రూ. 7,411.52 కోట్లు పంపిణీ చేశారు. కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించారు. మిగిలిన రైతులకు సాంకేతిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో రైతుబంధు పంపిణీ చేయలేదు. రాబోయే వానాకాలం సీజన్‌లో పట్టాదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.

 

 

అయితే ఏకకాలంలో నిధులు సర్దుబాటు చేయటానికి ఆర్థిక శాఖ ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే గత రెండు విడతల్లో చేసినట్లుగానే.. వారం పది రోజుల వ్యవధి తీసుకొని రోజుకో ఎకరం చొప్పున పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో నిధులు వేయనున్నారు. అందుకు అనుగుణంగా డేటాను డివైడ్ చేస్తున్నారు. తొలుత ఎకరం, రెండెకరాలు, మూడెకరాలు, నాలుగెకరాలు… ఇలా 10 ఎకరాల వరకు పది విడతలుగా నిధులు జమ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులను కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చనున్నారు.

 

 

 

 

ఈసారి మాత్రం జూన్‌ మొదటివారంలోనే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గడచిన యాసంగి సీజన్‌ నాటికే రాష్ట్రంలో 66.61 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలున్నాయి. 152.91 లక్షల ఎకరాలకు రైతులకు యాజమాన్య హక్కులు లభించాయి. అయితే యాసంగిలో 62.99 లక్షల మంది రైతులకు రూ. 7,411.52 కోట్లు పంపిణీ చేశారు. కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించారు. మిగిలిన రైతులకు సాంకేతిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో రైతుబంధు పంపిణీ చేయలేదు. రాబోయే వానాకాలం సీజన్‌లో పట్టాదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button