Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Telangana Rythu Runa Mafi List 2023 || KCR News Live

రూ. లక్ష, ఆపై రుణాల మాఫీకి సంబంధించిన చెల్లింపులు ప్రారంభం

 

 

Telangana Rythu Runa Mafi 2023 : రూ.లక్ష రుణమాఫీ సంపూర్ణం చేసే దిశగా ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. లక్ష లోపు రుణాల చెల్లింపులను గతంలోనే పూర్తి చేసిన సర్కార్.. ఆపై రుణాల మాఫీకి సంబంధించిన చెల్లింపులను కూడా ప్రారంభించింది. ఈ తరహాలో ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్ల వరకు చెల్లింపులు జరిగినట్లు సమాచారం. సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులు చేస్తున్నారు.

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం 2014లో తొలి విడతగా రుణమాఫీని అమలు చేసింది. రెండో విడతగా రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ(Rythu Runa Mafi Telangana) చేస్తామని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్​ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ ఏడాది డిసెంబరు 11 నాటికి ఉన్న చేయాలని నిర్ణయించారు. అందుకు ఆర్థికశాఖ, వ్యవసాయ అధికారులు బ్యాంకుల ద్వారా వివరాలు సేకరించినా.. ఆ తర్వాత పెద్దనోట్ల రద్దు, కరోనా, ఇతర ఇబ్బందులతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకులోనై నిధుల కొరత ఏర్పడింది.

 

 

Crop Loan Waiver Telangana Farmers 2023 :అయితేగత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. 2018 డిసెంబర్ 11 నాటికి రైతులు తీసుకున్న అప్పునకుగాను.. రూ.లక్ష రుణమాఫీ(Runa Mafi Money) చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందుకు అనుగుణంగా దశల వారీగా చెల్లింపులు చేస్తోంది. మిగిలిన మొత్తానికి సంబంధించిన చెల్లింపులు కూడా పూర్తి చేసి రుణమాఫీని సంపూర్ణం చేయాలని.. ఈ నెల మొదట్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును (CM KCR on Farmer Loan Waiver) ఆదేశించారు.

 

 

విడతల వారీగా చెల్లింపులు చేస్తూ సెప్టెంబర్ రెండో వారంలోపు రైతు రుణమాఫీని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఆర్థికశాఖ చెల్లింపులు చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు రూ.లక్షలోపు రుణాలు ఉన్న వారందరికీ సంబంధించిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రూ.99 వేల 999 వరకు అప్పులు ఉన్న వారందరికీ ఈ నెల 14న ప్రభుత్వం ఏక మొత్తంలో చెల్లింపులు చేసింది. 14న ఒక్క రోజే కి సర్కారు ఏకంగా రూ.5 వేల 809 కోట్ల చెల్లింపులు చేసింది. దాంతో 16 లక్షల 66 వేల 899 మంది రైతులకు సంబంధించి రూ.7 వేల 753 కోట్ల పైగా రుణమాఫీ చెల్లింపులు పూర్తయ్యాయి.

 

 

రూ.లక్ష, ఆపైన రుణాలు తీసుకున్న రైతులు 11 లక్షల మంది ఉన్నారు. వారందరికీ రూ.లక్ష వరకు మాఫీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.11 వేల కోట్లు అవసరం. రూ.లక్ష మొదలు.. తక్కువ రుణం ఉన్న వారి నుంచి మాఫీ పూర్తి చేయాలని నిర్ణయించారు. రూ.లక్ష, ఆపై ఉన్న వారికి కూడా  ప్రక్రియను ఆర్థికశాఖ రెండు రోజులు క్రితం ప్రారంభించింది. ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లకు చెల్లింపులు చేసినట్లు సమాచారం. ఇంకా రూ.10 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసి రుణమాఫీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఖజానాకు వస్తున్న ఆదాయాన్ని బట్టి క్రమంగా చెల్లింపులు చేసేలా ఆర్థికశాఖ చర్యలు తీసుకుంటోంది.

 

 

 

 

Related Articles

Back to top button