Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

AP Group 1, 2 Notification

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లు.. త్వరలో విడుదలకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

 

 

 

 

 

APPSC Group 1 Notification 2023 : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరలో గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

 

 

 

ప్రధానాంశాలు:

  • ఏపీ సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ
  • త్వరలో గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లు విడుదల
  • సుమారు 1000 పోస్టుల భర్తీకి ప్రణాళిక

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిషికేషన్లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నిరుద్యోగుల్లో ఆశలు చిగురించేలా.. త్వరలో గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దాదాపు వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.

 

 

కాగా.. బుధవారం ఉదయం ఈ పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు.

గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం ఆదేశించారని. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button