Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

PM Kisan Yojana

గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ పథకంపై కేంద్రం కీలక ప్రకటన.. ఇక చాలా సింపుల్!

 

 

PM Kisan KYC: రైతుల సంక్షేమం కోసం,, వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ స్కీమ్. దీని ద్వారా ఎందరో రైతులు డబ్బులు పొందుతున్నారు.. అయితే వీరికి ఇప్పుడు మరో శుభవార్త అందింది. కచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

PM Kisan KYC: రైతులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పంట సాయం అందించేందుకు గతంలో తీసుకొచ్చిన పీఎం కిసాన్ స్కీమ్ రైతులకు ఇప్పుడు తీపికబురు అందించింది. వారి కోసం అదిరిపోయే ఫీచర్ అందుబాటులో ఉంచింది. అదేంటో మీరు తెలుసుకోవాల్సిందే. పీఎం కిసాన్ లబ్ధిదారుల కోసం ఇప్పుడు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది మోదీ సర్కార్. PM Kisan Scheme లో తాజాగా ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచింది. రైతుల అకౌంట్లో డబ్బులు పడాలంటే కీలకంగా ఉన్న ఇ-కేవైసీ ప్రక్రియను దీని ద్వారా రైతులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
సాధారణంగానే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరిన రైతులు ఇ- కేవైసీ ప్రక్రియను కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. e-Kyc పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఏటా కేంద్రం పంట సాయం కింద రూ.6 వేలను మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల కింద రూ.2000 చొప్పున అందిస్తుంటుంది. దీనిని విడతల వారీగా ఇస్తుంటుంది. ఇప్పుడు 14వ విడత కింద రూ.2 వేలు అందాల్సి ఉంది కూడా. ఈ నెల చివరి కల్లా లబ్ధిదారులకు ఈ నగదు అకౌంట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇవి రావాలంటే రైతులు ఇ-కేవైసీ ప్రక్రియను కచ్చితంగా పూర్తి చేసుకొని ఉండాలి. చేసుకోని వారు.. గుర్తులేనివారు, మర్చిపోయిన వారు ఇది త్వరగా చేసుకోవాలి. అంతకుముందు ఆధార్ ఓటీపీ ద్వారా ఈ పని పూర్తి చేసే ఆప్షన్ ఉండేది. లేదా దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌‌కు వెళ్లి కేవైసీ పూర్తి చేయొచ్చు.

ఇక ఇప్పుడు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఇ-కేవైసీ కోసం ఇకమీదట ఎక్కడికీ వెళ్లాల్సిన పని ఉండదు. ఆధార్ ఓటీపీ కూడా అవసరం లేదు. ఎందుకంటే.. కొత్తగా వచ్చిన ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ సర్వీస్ ద్వారా.. ఆధార్ ఓటీపీ లేకుండానే కేవైసీ ప్రక్రియ చేసుకోవచ్చు.

దీని వల్ల ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్ లేకుండా కూడా PM Kisan e kYC కంప్లీట్ చేయొచ్చు. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేని రైతులకు.. ఈ సర్వీసుల వల్ల పెద్ద ఊరట కలిగిందని చెప్పొచ్చు. ఇప్పటికి ఇ-కేవైసీ చేసుకోని వారు.. ఇలా ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌తో ఆ ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఇక పీఎం కిసాన్ రైతులు.. తమకు నెక్ట్స్ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా PM Kisan వెబ్‌సైట్‌లో బెనిఫిషియరీ ఆప్షన్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button