rythubandhu.telangana.gov.in Rythu Bandhu Status 2022 Check here
Rythu Bandhu Amount 2022

రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. వానాకాలం రైతుబంధు నిధుల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ సీజన్కు 68లక్షల 10 వేల మంది అర్హులుగా ఉన్నారు. కోటి 50లక్షల ఎకరాలకు 7వేల 5వందల కోట్లు పెట్టుబడి సాయంగా అందించేందుకు అధికారం యంత్రాంగం సిద్ధమైంది. దశల వారిగా రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. కాగా మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Rythu Bandhu : రైతులకు శుభవార్త.. రైతుబంధులో కొత్త లబ్ధిదారులకు అవకాశం.. కటాఫ్ తేదీ ఇదే..
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న రైతుబంధు పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కీలక ప్రకటన వెలువడింది. ఏడాది గ్యాప్ తర్వాత రైతుబంధులోకి కొత్త లబ్దిదారులకు అవకాశం కల్పించారు. నమోదు ప్రక్రియ, తేదీల పూర్తి వివరాలివే..
గతేడాది వానాకాలం సీజన్లో కూడా కొత్త లబ్ధిదారుల నమోదుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. యాసంగి సీజన్లో మాత్రం కొత్తవారికి చోటివ్వలేదు. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు 9వ విడత రైతుబంధు పథకంలోకి కొత్త లబ్ధిదారులను చేర్చే అవకాశం దొరికింది. 2021 జూన్ పదో తేదీ నుంచి 2022 జూన్ ఐదో తేదీ వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల ఆధారంగా కొత్త వారికి ఛాన్స్ దక్కనుంది.
సీఎం కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు పథకానికి సంబంధించి మరో శుభవార్త వెలువడింది. ఈనెల 28(మంగళవారం) నుంచి రైతుబంధు 9వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమకానుండగా, ఈసారి కొత్త లబ్ధిదారుల నమోదుకు సైతం కేసీఆర్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రైతుబంధు పథకంలో కొత్త లబ్దిదారుల నమోదుకు జూన్ 5ను కటాఫ్ తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ నెల ఐదో తేదీ నాటికి రిజిస్ట్రేషన్ జరిగి, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన భూములను రైతుబంధు పోర్టల్లో నమోదుచేసుకునే అవకాశాన్ని కల్పించారు.
కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారి)కి సమర్పించాల్సి ఉంటుంది. ఆదివారం ఉదయం నుంచి ఏఈవో లాగిన్ను ఓపెన్ చేశారు. సీసీఎల్ఏ నుంచి వచ్చిన డేటా ఆధారంగా వ్యవసాయశాఖ అధికారులు రైతుల వివరాలను అప్లోడ్ చేస్తారు.
మరోవైపు, ఈనెల 28 తేదీ (మంగళవారం) నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు కేసీఆర్ సర్కారు ఏర్పాటుచేస్తోంది. దానికి రెండు రోజులు ముందు మాత్రమే రైతుబంధు పోర్టల్ ఓపెన్ చేశారు. దీంతో రైతులు, ఏఈవోలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నిధుల కొరతతో ఒకవేళ పంపిణీ ఆలస్యమైతే ముందుగా సమయమిచ్చి, కటాఫ్ తేదీని ప్రకటించి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రారంభిస్తే సౌకర్యవంతంగా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదివారంతో కలిపి రెండు రోజులు మాత్రమే కొత్త లబ్ధిదారుల నమోదుకు అవకాశం కల్పించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతున్నా, మరోవైపు లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగు తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త లబ్దిదారుల నమోదుకు చివరితేదీ జూన్ 27తో ముగుస్తుందా? ఆ తర్వాత కూడా అనుమతిస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
నిజానికి రైతుబంధు లబ్దిదారులు అందరికీ ఒక్క రోజులోనే ఖాతాల్లో డబ్బు జమచేసే పరిస్థితిలేదు. ఆరోహణ క్రమంలో(తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం వరకు) రోజుకో ఎకరం చొప్పున పెంచుతూ పది రోజులకు పైగా నగదు బదిలీచేసే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో ఏఈవోలు రైతుబంధు పోర్టల్లో కొత్త లబ్ధిదారులను కూడా నమోదుచేస్తారని అధికారులు చెబుతున్నారు.
గత యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది రైతులకు రూ. 7411.52 కోట్లు రైతుబంధు పథకం కింద నగదు బదిలీ చేశారు. ఈ సీజన్(9వ విడత)కు 65 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో నిధులు కూడా పెరగనున్నాయి.