Telangana government good news for students!
విద్యార్థులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్!
బీఈడీ చేసిన బీటెక్ విద్యార్థులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా వెలువడిన డీఎస్సీ నోటిఫికేషన్ కు వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్ పోస్టులకు వారు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీఎస్సీకి అప్లై చేసుకునేందుకు వీరికి ఒకటి రెండు రోజుల్లో ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది.
ఇండియన్ నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశం. దీనికి ఎటువంటి పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇండియన్ నేవీ SSC ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమయింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ joinindiannavy.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.