Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Telangana Singareni Jobs Notification 2022

తెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త.. సింగరేణిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పటినుంచంటే?

 

 

 

 

తెలంగాణలో ప్రస్తుతం కొలువుల జాతర (Telangana Government Jobs) కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీస్, గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. టెట్ ఎగ్జామ్స్ (TET Exams) ను సైతం ఇటీవల విజయవంతంగా నిర్వహించారు అధికారులు. తాజాగా సింగరేణి యాజమాన్యం (Singareni Collieries Company) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 177 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎక్స్‌‌టర్నల్‌ క్లర్కు పోస్టుల విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుకు జులై 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు www.scclmines.com వెబ్ సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ ను www.scclmines.com వెబ్ సైట్లో ఒకటి రెండు రోజుల్లో అందుబాటులో తీసుకువచ్చే అవకాశం ఉంది.

 

 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతల విషయానికి వస్తే.. అభ్యర్థులు కనీస బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు కంప్యూటర్స్‌/ఐ.టీ ఒక సబెక్టుగా ఉన్నవారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్‌ కోర్సు ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి గరిష్ట వయసు 30 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ఐదు ఏళ్ల మినహాయింపు ఉంటుంది.

 

 

ఇంకా.. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ ఖాళీలను 95శాతం లోకల్‌ అభ్యర్థులతో అంటే ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన వారితో భర్తీ చేయనున్నారు. మిగిలిన 5 శాతం పోస్టులు అన్‌ రిజర్వుడు కోటాకింద ఓపెన్‌ టు ఆల్‌ కింద భర్తీ చేయనున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్షనిర్వహించనున్నారు. రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button