Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS Inter Results 2023

తెలంగాణ ఇంటర్ 1st 2nd Year ఫలితాలు విడుదల | TS Inter 1st 2nd Year Results Link

 

 

 

తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ముగిశాయి. ఇంట‌ర్ మొదటి , 2వ సంవ‌త్స‌రం కలిపి దాదాపు 9,48,010 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ప‌రీక్ష‌లు మార్చి 29వ తేదీతో (బుధవారం) ముగిసిన విషయం అందరికీ తెలిసిందే.

 

 

 

ఇంట‌ర్ 2వ సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 4,02,630 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫస్టియర్‌ ఇంటర్‌కు 4,82,619 మంది ఉన్నారు. ఇక‌ ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాత్రం మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు మారాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. నీట్, టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు మే 7 నుంచి 11 వరకు జరగాల్సి ఉంది. అయితే మారిన షెడ్యూల్ ప్రకారం మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.

 

 

మే 7న నీట్ (యూజీ) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. మే 10, 11 తేదీల్లోనే ఈ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు ముగియడంతో ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ పై దృష్టి సారించింది.  గత వారంలోనే వాల్యుయేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అనుకున్న విధంగానే అతి తక్కువ సమయంలో వాల్యువేషన్ పూర్తి చేసి రిజల్ట్స్ నీ విడుదల చేసింది. మీరు రిజల్ట్స్ నీ చెక్ చేసుకోవాలని క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోగలరు. అలాగే జూన్​ 1వ తేదీ నుంచి తిరిగి ఇంట‌ర్ తరగతులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

 

 

ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్‌లైన్‌లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్‌ తెలిపారు. టెన్త్‌ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్‌ కాలేజీల అఫ్లియేషన్‌ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్‌ లేకపోతే పరీక్షకు బోర్డ్‌ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు. ఇక ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

ఫలితాలు చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి.

 

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button