Central Government jobs in India 2023 || Telangana government job updates 2023 || Andhra Pradesh government jobs 2023
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 9,79,327 లక్షల ఉద్యోగాలు.. శాఖల వారిగా ఖాళీల వివరాలు ఇవే..
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. 2021 మార్చి 1 నాటికి కేంద్రంలోని 78 మంత్రిత్వశాఖలు, వివిధ విభాగాల్లో 979327 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
అలాగే వీటిలో అత్యధికంగా రైల్వేలో 2.93 లక్షల పోస్టులు ఉన్నట్లు నివేదించింది. తర్వాత ప్రాధాన్యతలో రక్షణశాఖ 2.64 లక్షలు, హోంశాఖ 1.43 లక్షల ఖాళీలను కలిగివున్నాయి. రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు.
నిరుద్యోగులకు శుభవార్త, గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్, 17 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతూ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్, 17 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతూ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది.
జూనియర్ కళాశాలల్లో 2,008 లెక్చరర్ పోస్టులు, పాఠశాలల్లో 1,276 పీజీటీ, 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్స్, 124 మ్యూజిక్, 4,020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనుంది. అలాగే, డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపక పోస్టులతోపాటు ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను కూడా భర్తీ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్లోని కొత్త జిల్లాల్లో మండల, జిల్లా స్థాయి పోస్టులతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగేలోగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్, పదోన్నతులు, ఇన్చార్జి బాధ్యతల అప్పగింత ద్వారా త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.
ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి కార్యదర్శులకు సూచించారు. ఫిబ్రవరి 16వ తేదీన (గురువారం) రాష్ట్ర సచివాలయం ఐదవ బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరిగింది.
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగు పరచడం, అధికారాల బదిలీ, కలెక్టర్లతో వీడియో సమావేశాల్లో వచ్చిన అంశాలపై ఫాలోఅప్ చర్యలు, అసెంబ్లీకి సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ ఎల్ఏక్యూ, ఎల్సీక్యూలపై సత్వరం సమాచారం అందించడం, తదితర అజెండా అంశాలపై సీఎస్ కార్యదర్శులతో సమీక్షించారు.
3) IKDRC RECRUITMENT
4) CRPF RECRUITMENT
5) UPSC RECRUITMENT
6) MIL RECRUITMENT
7) NMDC RECRUITMENT
8) SVIMS RECRUITMENT