Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

PM Kisan 15th Installment 2023

పండుగ రోజు రైతులకు గుడ్ న్యూస్.. నవంబర్ 15న రైతుల ఖాతాలోకి రూ. 2000 డబ్బులు..

 

 

 

పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 15వ ఇన్స్టాల్మెంట్ కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. కేవలం మరొక నాలుగు రోజుల్లోనే పీఎం కిసాన్ 15వ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాలో జమ కానుంది.

పీఎం కిసాన్ పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 15వ ఇన్స్టాల్మెంట్ కోసం దేశంలోని అర్హులైన రైతులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పీఎం కిసాన్ 15వ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ బయటికి వచ్చింది.
పీఎం కిసాన్ 15వ ఇంస్టాల్మెంట్ ను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పద్దతిలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలోకి డిపాజిట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పీఎం కిసాన్ 15వ ఇన్స్టాల్మెంట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని ప్రముఖ మీడియా సంస్థల ద్వారా సమాచారం అందుతుంది. ఇదే నిజమైతే నవంబర్ 15వ తేదీన దేశంలోని అర్హులైన 8 కోట్ల మంది రైతుల బ్యాంకు అకౌంట్ లోకి రూ. 2000 డిపాజిట్ అవ్వనున్నాయి.

దసరా, దీపావళి పండుగల సందర్భంగా పీఎం కిసాన్ 15వ ఇన్స్టాల్మెంట్ ను అనుకున్న తేదీ కంటే ముందుగానే రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే దసరా పండుగ ఇప్పటికే అయిపోగా, రేపే దీపావళి పండుగ కూడా వస్తుంది. అయితే ఇప్పటి వరకు 15వ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించిన రూ. 2000 విడుదల కాలేదు. దీంతో దీపావళి పండుగ లోపు పీఎం కిసాన్ 15వ ఇన్స్టాల్మెంట్ వచ్చే అవకాశం లేదు. ఇక నవంబర్ 15వ తేదీనే పీఎం కిసాన్ 15వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద రైతులకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ. 6000 లను అందిస్తుంది. ఈ రూ. 6000 లను ఒకేసారి కాకుండా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్ లోకి కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది.

ఈ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 14 ఇన్స్టాల్మెంట్స్ ను కేంద్ర ప్రభుత్వం రైతులకు బదిలీ చేయడం జరిగింది. జూలై 27 న చివరిసారిగా పీఎం కిసాన్ 14 ఇన్స్టాల్మెంట్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా ఈ పథకానికి సంబంధించిన 15వ ఇన్స్టాల్మెంట్ ను నవంబర్ 15వ తేదీన అనగా బుధవారం అర్హులైన రైతులకు ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరొకవైపు పీఎం కిసాన్ 15 వ ఇన్స్టాల్మెంట్ ను పొందాలనుకునే రైతులు మాత్రం ఖచ్చితంగా ఈ-కేవైసీ తో పాటు ల్యాండ్ డేటా సీడింగ్, అలాగే ఆధార్-బ్యాంకు అకౌంట్ లింక్ ను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.
దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, రూ. 2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన వడ్డీ రేట్లు జూలై 19 నుంచి అనగా నిన్నటి నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.25 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. మరీ ముఖ్యంగా 366 రోజుల నుంచి 399 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 7.60 శాతం వడ్డీ రేటును బ్యాంకు అందిస్తుంది.
7 రోజుల నుంచి 14 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 5.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 15 రోజుల నుంచి 35 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 5.30 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 36 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 5.55 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 46 రోజుల నుంచి 60 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 5.85 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 61 రోజుల నుంచి 91 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 92 రోజుల నుంచి 180 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 181 రోజుల నుంచి 270 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 271 రోజుల నుంచి 365 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 7.30 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 366 రోజుల నుంచి 399 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 400 రోజుల నుంచి 731 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 732 రోజుల నుంచి 1095 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

Related Articles

Back to top button