Telangana Jobs || TSPSC నిరుద్యోగులకు పండగే.. గ్రూప్-4లో మరో 700 పోస్ట్లు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?
తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగాల సీజన్ నడుస్తోంది. వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఐతే చాలా మంది గ్రూప్-4 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని వేచిచూస్తున్నారు. ఇలాంటి సమయంలో నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త వచ్చింది.
గ్రూప్-4 ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి నిజంగా శుభవార్త ఇది. త్వరలో భర్తీ చేయబోయే గ్రూప్-4 పోస్ట్ల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం పెంచుతోంది. నిరుద్యోగుల నుంచి భారీగా స్పందన ఉండడంతో.. వేకెంట్ పోస్టులను మరింతగా పెంచనున్నారు.
రాష్ట్రంలో 9,168 గ్రూప్-4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు వీటికి అదనంగా 600-700 పోస్టులు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-4 మొత్తం పోస్టుల 9,800 దాటుతుందని సమాచారం..
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతో గ్రూప్-4 పోస్టులపై ఉన్నత స్థాయి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా అదనపు పోస్టులపై చర్చ జరిగినట్లు సమాచారం. అవసరమైతే కొందరికి ప్రమోషన్లు ఇచ్చైనా సరే.. పోస్టుల సంఖ్య పెంచాలని హెచ్వోడీలు ఆదేశించారు.
మొత్తం 80 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తున్నట్లు రెండు నెలల కిందట సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. వీటిలో ఇప్పటి వరకు 39 వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చింది. ఇందులో గ్రూప్1, ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడదలయ్యాయి.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతో గ్రూప్-4 పోస్టులపై ఉన్నత స్థాయి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా అదనపు పోస్టులపై చర్చ జరిగినట్లు సమాచారం. అవసరమైతే కొందరికి ప్రమోషన్లు ఇచ్చైనా సరే.. పోస్టుల సంఖ్య పెంచాలని హెచ్వోడీలు ఆదేశించారు.
మొత్తం 80 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తున్నట్లు రెండు నెలల కిందట సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. వీటిలో ఇప్పటి వరకు 39 వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చింది. ఇందులో గ్రూప్1, ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడదలయ్యాయి.
వరుసగా నోటిఫికేషన్లు వచ్చినా.. నిరుద్యోగుల్లో రిక్రూట్మెంట్ ఫీలింగ్ కలగడం లేదని.. పోస్టుల సంఖ్య మరింతగా పెంచితే బాగుటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని.. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్టు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రూప్-4 పోస్టుల పెంపుపై సర్కార్ దృష్టి సారించింది.
అదనపు పోస్టులపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. అనంతరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) నాటికి గ్రూప్-4 నోటిఫికేషన్ను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. కానీ ఆ టైమ్కల్లా నోటిఫికేషన్ రాకపోవచ్చని.. జూన్ 15 తర్వాతే విడుదల చేసే అవకాశముందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
మే 29 కల్లా రోస్టర్ పాయింట్లు, ఇతర వివరాలు రెడీ చేసి ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఐతే ఆ తర్వాత చేపట్టే ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టవచ్చని.. ఈ క్రమంలోనే నోటిఫికేషన్ విడుదలకు మరికొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది.