Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News
TSPSC Group-2
గ్రూప్-2 నోటిఫికేషన్ కు సర్వం సిద్ధం.. తేలిన ఖాళీల లెక్క.. పూర్తి వివరాలివే!
తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధం చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు ఊరిస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ కు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం గ్రూపు-2 పోస్టుల సంఖ్యపై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు ముమ్మరం చేసింది.
అయితే.. ఖాళీల సంఖ్యలో కన్ఫ్యూజన్ కారణంగా గత వారంలోనే విడుదల కావాల్సిన గ్రూప్-2 నోటిఫికేషన్ వాయిదా పడింది. అయితే.. తాజాగా రాష్ట్రంలోని మొత్తం గ్రూప్-2 ఉద్యోగ ఖాళీలను 783గా తేల్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.
పోస్టుల సంఖ్య, వాటి రోస్టర్ విధానం తదితర అంశాలపై ఆయా శాఖల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మొత్తం 783 గ్రూప్-2 ఖాళీలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ప్రభుత్వం నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ నెలాఖరులోగా గ్రూపు-2 నోటిఫికేషన్ ను విడుదల చేయడానికి TSPSC సిద్ధమవుతోంది.
నోటిఫికేషన్ విడుదల తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల పాటు సమయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తర్వాత పరీక్షకు సంబంధించి రెండు నుంచి మూడు నెలల సమయం ఇవ్వనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష తేదీలను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది.
ఒక ప్రిపరేషన్ తో అన్ని పరీక్షలు:
ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి ప్రకటనలు విడుదల అయ్యాయి. గ్రూప్-1 కు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ సైతం పూర్తి కావడంతో ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలు వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి ప్రకటనలు విడుదల అయ్యాయి. గ్రూప్-1 కు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ సైతం పూర్తి కావడంతో ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలు వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇంకా గ్రూప్-4 కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ ను మార్చి లేదా ఏప్రిల్లో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్ష తర్వాత గ్రూప్-4 ను నిర్వహించే అవకాశం ఉంది.
టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ పూర్తయిన తర్వాత సెంటర్ల విషయంలో ఇబ్బందులు ఉండవని.. అందుకే ఆ తర్వాత ఈ ఎగ్జామ్స్ ను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలు పూర్తయిన తర్వాత గ్రూప్-2 నియామక పరీక్షను నిర్వహించాలన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. దీంతో ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వారు అన్నింటికీ హాజరుకావొచ్చు.