Andhra PradeshEducationNational & InternationalSocialTelanganaTop News

Telangana constable preliminary exam key 2022 || Telangana police constable preliminary exam question paper with answers 2022

Telangana police constable preliminary exam key 2022

 

 

 

మొత్తం పోస్టుల్లో 16,614 కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టులకు తొలుత నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కానిస్టేబుల్‌ పోస్టులు 16,027 ఉండగా, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 587 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు చేసుకున్నారు.

 

 

తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే (మే 26) ఆఖరు తేది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 17,516 పోలీస్‌ ఉద్యోగాలకు వేర్వేరుగా నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

ఈ మొత్తం పోస్టుల్లో 16,614 కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టులకు తొలుత నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కానిస్టేబుల్‌ పోస్టులు 16,027 ఉండగా, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 587 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రోజు (మే 26) రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నందున.. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా తెలంగాణ స్టేట్ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) సూచించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://www.tslprb.in/ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

 

మొత్తం పోస్టులు: 16,614 (కానిస్టేబుల్‌ పోస్టులు- 16027, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు- 587)

  • సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులు: 4965
  • ఏఆర్‌ కానిస్టేబుల్‌ పోస్టులు: 4423
  • ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ కానిస్టేబుల్‌ పోస్టులు: 100
  • టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ పోస్టులు: 5010
  • తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ విభాగం పోస్టులు: 390
  • డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ విభాగం పోస్టులు: 610
  • జైల్‌ వార్డర్లు (మేల్‌) పోస్టులు: 136
  • జైల్‌ వార్డర్లు (ఫిమేల్‌) పోస్టులు: 10
  • ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఆర్గనేజేషన్‌ కానిస్టేబుల్‌ పోస్టులు: 262
  • కానిస్టేబుల్‌ (మెకానిక్‌ (మెన్‌)) పోస్టులు: 21
  • కానిస్టేబుల్‌ (డ్రైవర్లు) పోస్టులు: 100
  • సివిల్‌ ఎస్‌ఐ పోస్టులు: 414
  • ఏఆర్‌ ఎస్‌ఐ పోస్టులు: 66
  • ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ పోస్టులు: 5
  • టీఎస్‌ఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులు: 23
  • తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగం ఎస్‌ఐ పోస్టులు: 12
  • డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ విభాగం పోస్టులు: 26
  • డిప్యూటీ జైలర్‌ పోస్టులు: 8
  • టెక్నికల్‌ ఎస్‌ఐ పోస్టులు: 22
  • ఎస్‌ఐ పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనేజేషన్‌ (మెన్‌) పోస్టులు: 03
  • అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో) పోస్టులు: 08

 

  • అర్హతలు: కానిస్టేబుల్‌ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
  • జీతం: కానిస్టేబుల్‌ పోస్టులకు నెలకు రూ.24,280 నుంచి రూ.72,850ల వరకు ఉంటుంది.
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నెలకు రూ.42,300 నుంచి రూ. 1,15,270 ల వరకు ఉంటుంది.

 

 

 

 

ఆగష్టు 28వ తేదీ ఆదివారం జరగనున్న తెలంగాణ కానిస్టేబుల్ (Telangana Police Jobs) ప్రిలిమినరీ రాత పరీక్షకు (TS Constable Exams) ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు కూడా సిద్ధమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  వ్యాప్తంగా 4939 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 

 

ఆగష్టు 28వ తేదీ ఆదివారం జరగనున్న తెలంగాణ కానిస్టేబుల్ (Telangana Police Jobs) ప్రిలిమినరీ రాత పరీక్షకు (TS Constable Exams) ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు కూడా సిద్ధమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) వ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో కేఎస్ఎం కళాశాలలో పరీక్షా కేంద్రాల రీజనల్ కో-ఆర్డినేటర్స్,చీఫ్ సూపరింటెండెంట్స్, అబ్జర్వర్స్ మరియు పోలీసు అధికారులతో గురువారం అవగాహనా సమావేశం నిర్వహించారు. ఆగష్టు 28 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షా సమయం ఉండగా…ఈ రాత పరీక్షకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.

 

 

.
ఈసందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ కొత్తగూడెం మరియు పాల్వంచ పరిధిలోని 39 పరీక్షా కేంద్రాలలో 14,221 మంది, భద్రాచలంలో ఏర్పాటు చేసిన 10 కేంద్రాలలో 2,856 మంది అభ్యర్థులు ఈ రాత పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారానే అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించడం జరుగుతుందని ఎస్పీ వినీత్ స్పష్టం చేశారు. కొత్తగూడెం రీజియన్ నందు ఏర్పాటు చేసిన 39 పరీక్ష కేంద్రాలకు మైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ పున్నం చందర్, భద్రాచలం నందు ఏర్పాటు చేసిన 10 కేంద్రాలకు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ భద్రయ్య రీజనల్ కో-ఆర్డినెటర్స్‌గా వ్యవహరిస్తారని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ వివరించారు. 49 పరీక్షా కేంద్రాలకు 49 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ మరియు 49 మంది అబ్జర్వర్సుగా వ్యవహరించనున్నారు.

 

 

 

ఈ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఎస్పీ సూచించారు.కానిస్టేబుల్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కొన్ని నియమ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
1. www.tslprb.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై నిర్దేశిత స్థలంలో అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగాఅతికించుకోవాలి.
2. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు బ్ల్యూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే వెంట తెచ్చుకోవాలి.
3. అభ్యర్థులు సెల్ ఫోన్, ట్యాబ్లెట్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ డివైస్, చేతి గడియారం, క్యాలిక్యులేటర్, లాగ్ టేబుల్, వాలెట్, పర్స్ నోట్స్, ఛార్జ్,రికార్డింగ్ పరికరాలు, ఖాళీ పేపర్లను వెంట తీసుకురాకూడదు.
4. ఎలాంటి ఆభరణాలు ధరించరాదు. హ్యాండ్ బ్యాగ్, పౌచ్‌లు లాంటివి తీసుకురావద్దు. భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి క్లాక్రూములు ఉండవు.
5. బయోమెట్రిక్ నేపథ్యంలో అభ్యర్థులు చేతివేళ్ళకు మెహంది, టాటూలు లేకుండా చూసుకోవడం తప్పనిసరి
6. ఓఎంఆర్ షీట్స్ పై అనవసర రాతలు, గుర్తులు, మత సంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్ ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.
7. పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు టిక్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఇంగ్లీష్ వర్షన్‌నే పరిగణలోకి తీసుకోవాలి.
మంచి మార్కులు సాధించి ఉద్యోగం సంపాధించడానికి కొన్ని అంశాలు సూచనలను అభ్యర్థులకు అందించారు ఇండియన్ హిస్టరీ ఉపాధ్యాయుడు రాజారెడ్డి. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ మూడు అంశాలు ప్రధానంగా ఉంటాయి. వీటిని చదవడంతో మంచి మార్కులు సాధించుకోవచ్చని ఆయన అన్నారు. ఇంతకు ముందు మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్లో భాగంగా అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ మరియు ప్యూర్ మ్యాథ్స్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దానికి ధీటుగా ఇప్పుడు హిస్టరీ సబ్జెక్టు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అని ఆయన అన్నారు. మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్లో ఏ విధంగా అయితే ఎక్కువ బిట్స్ వస్తాయో అదే విధంగా హిస్టరీ సబ్జెక్టులో కూడా 50 కి పైగా బిట్లు రావడం జరుగుతుంది. అందువల్ల హిస్టరీ సబ్జెక్టును కూడా క్షుణ్ణంగా చదివినట్లయితే ఈజీగా మార్కులను సంపాదించవచ్చని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎస్సై కానిస్టేబుల్ పరీక్షలో డైరెక్ట్ బిట్స్ అడిగేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రింది వానిలో సరియైనవి ఏవీ? క్రింది వానిలో జతపరుచుము? అన్నటువంటి ఇన్ డైరెక్ట్ ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీలో ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం అనే మూడు భాగాలు ఉంటాయి. ప్రాచీన యుగం మధ్యగంలో కంటే ఆధునిక యుగం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఆధునిక యుగం చదవడంలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మంచిది అని ఆయన అన్నారు. ఆధునిక యుగం నుంచి 12 నుండి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కానిస్టేబుల్ పరీక్షకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ బుక్స్ తెలంగాణ ప్రభుత్వం చే ప్రచురించబడినటువంటి అకాడమీ పాఠ్యపుస్తకాలను చదవాలి.
ఎస్ఐ పరీక్షకు డిగ్రీ వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన అకాడమీ పాఠ్యపుస్తకాలను చదవవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు చరిత్ర నుంచి 50కి పైగా బిట్స్ రావడం జరుగుతుంది. కావున మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్లో భాగమైనటువంటి ఆర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ మరియు ప్యూర్ మ్యాచ్ కి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇస్తామో.. అదే విధంగా హిస్టరీకి కూడా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా చదవడం వలన ఈజీగా మార్కులు సంపాధించవచ్చు. హిస్టరీ సబ్జెక్టులో తెలంగాణ హిస్టరీ గురించి క్షుణ్ణంగా చదివినట్లయితే మంచి మార్కులు వస్తాయి.
మొట్ట మొదటిసారిగా ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలు నెగటివ్ మార్క్స్ పెట్టడం జరిగింది. కావున తెలిసినటువంటి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ఉత్తమం. సరైన సమాధానం తెలిస్తేనే జవాబు ఇవ్వాలి. ఏదో ఒకటి అని మనం సమాధానం ఇవ్వడం వల్ల వచ్చినటువంటి మార్కుల నుంచి మైనస్ మార్కులు వచ్చే ప్రమాదం ఉంది.. కాబట్టి మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కావున జాగ్రత్తగా ప్రశ్నలను అవగాహన చేసుకుని సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button